Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగివున్న లారీన ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు : ముగ్గురి మృతి

ఆగివున్న లారీన ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు : ముగ్గురి మృతి
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (09:59 IST)
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఓ ప్రైవేట్‌ బస్సు రోడ్డుపైన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, 10మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతి చెందినవారిని నాగేశ్వరరావు(44), జయరావు(42), మల్లికార్జున్(40)గా పోలీసులు గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరికాస్త తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు