Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న అన్నా అంటూ పలుకరించేవాడు.. శివప్రసాద్ మృతిపై మోహన్ బాబు

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (10:45 IST)
టీడీపీ మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మృతిపై సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు స్పందించారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదే అంశంపై మోహన్ బాబు ఓ ట్వీట్ చేశారు.
 
"డా.శివ ప్రసాద్ నాకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి తెలుసు. 1985 - 90లలో నేను హీరోగా నటించిన 'భలే రాముడు' అనే సినిమాలో ఓ గెస్ట్ వేషంలో నటించాడు. అతను నాకు మంచి మిత్రుడు, నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త.
 
ఇటీవలే నాతో 'గాయత్రి'లో కూడా యాక్ట్ చేశాడు. ఎప్పుడు పలకరించినా అన్న అన్న అంటు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది. అతనికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. 
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments