Publish Date: Sun, 07 Jul 2019 (11:11 IST)
Updated Date: Sun, 07 Jul 2019 (11:12 IST)
వైకాపా అధినేత, నవ్యాంధ్ర రెండో సీఎం జగన్మోహన్ రెడ్డిపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. జగన్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
తన కోరిక ఫలించింది. అందుకే ఏడాదిన్నర తర్వాత శ్రీవారిని దర్శించుకున్నానని.. ఆ కోరిక ఏంటో భగవంతుడికి తెలుసునని మోహన్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వచ్చాడన్నారని చెప్పారు. గతంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్ గెలిచినప్పుడు కూడా మోహన్ బాబు ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు.
కేసీఆర్ గెలవాలని, టిఆర్ఎస్ మళ్లీ రావాలనీ ప్రార్థించానని అన్నారు. సీనియర్ నటుడు మోహన్బాబు. ఎన్నికలకు ముందు ఫిలింనగర్లోని దేవాలయానికి వెళ్లి కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకున్నాననని చెప్పారు.