మీకు 45 మంది సల‌హాదారులా? 25మందికి క్యాబినేట్ హోదానా?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (10:15 IST)
ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ప్రజలకు పనికిరాని ఈ వ్య‌వ‌స్థ వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాకు గండిప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థ అస‌లు ఎవరికి ఉపయోగపడుతుందో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పాలని అశోక్ బాబు డిమాండు చేశారు.

సలహాదారుల వ్యవస్థే పనికిరాని, పనికిమాలిన వ్యవస్థని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. ఏ అర్హత, అనుభవం ఉన్నాయని జగన్ ప్రభుత్వం 45మందిని సలహాదారులుగా నియమించింది? అని ప్రశ్నించారు. వారిలో 25 మందికి కేబినెట్ హోదా కూడా ఎలా ఇచ్చారని పేర్కొన్నారు.
 
ప్ర‌భుత్వానికి మంచి స‌ల‌హాలు ఇవ్వాల్సిన స‌ల‌హాదారులు... రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తే, ప్ర‌తిప‌క్షాల‌కు సమాధానాలు ఇస్తున్నార‌ని ఆయ‌న ప‌రోక్షంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డిని ప్ర‌స్తావించారు. అస‌లు వారు ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇవ్వ‌కుండా, మీడియా ముందుకు వ‌చ్చి... ప్ర‌తిప‌క్షాలపై విరుచుకుప‌డ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు వీరు ప్ర‌జ‌ల‌కు నీతులు చెప్పే స్థాయికి ఎదిగార‌ని విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments