Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడ శ్రీనివాస్ ఆలనా.. పాలనా నేనే చూసుకున్నా : దివ్వల మాధురి

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (18:39 IST)
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండిళ్ల పంచాయతీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తన భార్య దువ్వాడ వాణి, ఇద్దరు కుమార్తెలకు దూరంగా తన సన్నిహితురాలు దివ్వల మాధురి నివాసంలో ఉంటూ వచ్చారు. ఈ వ్యవహారం ఇటీవలే బహిర్గతమైంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, ఆయన పెద్ద కుమార్తె హైందవి కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఉండే ఇంటివద్దకు వెళ్లి ఆందోళన చేయడంతో ఈ గుట్టు రట్టయింది. ఈ పరిస్థితుల్లో దివ్వల మాధురి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. 
 
ఇంతకాలంలేని భయం, ప్రాణహాని ఇపుడు ఎందుకు కలుగుతుందని ప్రశ్నించారు. తనవల్ల దువ్వాడకు ప్రాణహాని ఉందని వాణి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఆలనా పాలనా తానే చూసుకున్నట్టు చెప్పారు. గత రెండేళ్లుగా లేని థ్రెట్‌ ఇప్పుడే వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. దువ్వాడను చంపడానికి వాణి ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
పది మందిని తీసుకొచ్చి తలుపులు పగులగొట్టారని, ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసని దివ్వల మాధురి అన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్లు ఇచ్చానని, వాణి తన డబ్బు చెల్లించి ఇంటిని తీసుకోవచ్చని మాధురి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments