Publish Date: Sun, 18 Aug 2024 (01:19 IST)
Updated Date: Sun, 18 Aug 2024 (01:29 IST)
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు. భార్యతో సెటిల్ చేసుకొని, విడాకులు తీసుకుంటానని స్పష్టం చేశారు. దాంతో ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరింది. దువ్వాడ శ్రీనివాస్కు పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత వాణి కొత్త పల్లవి అందుకున్నారు. మరోసారి దువ్వాడ శ్రీను ఇంటి వద్దకు వచ్చారు.
గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు. తనకు ఆస్తి అవసరం లేదని మరో డ్రామాకు తెరతీశారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని చెబుతున్నారు. శ్రీను కొత్తగా నిర్మించిన ఇంట్లోనే ఉంటానని తెగేసి చెప్పారు. తనకు ఏ ఆస్తి వద్దు, కూతుళ్ల భవిష్యత్ను శ్రీను చూసుకుంటే చాలని కొత్త పల్లవి అందుకున్నారు. కానీ వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ ఇష్టపడటం లేదు.
తాజాగా వాణి మీడియాతో మాట్లాడుతూ.. తన సమస్యలను ఎవరితోనూ పంచుకోని శ్రీను.. తన సమస్యలను రకరకాలుగా డైవర్ట్ చేసుకుంటారని వాణి అన్నారు. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మాపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను.
ఆడబిడ్డల భవిష్యత్తు కోసం.. ఆయన ఎలా తిరిగినా, ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. పిల్లల బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలి. నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఈ మేరకు ఆయనతో లిఖితపూర్వకంగా రాజీ కుదుర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను... అంటూ చెప్పారు.