Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురంలో త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ : డీఐజీ పాల్‌రాజు

Webdunia
సోమవారం, 30 మే 2022 (11:58 IST)
కోనసీమ జిల్లా పేరును మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ కారణంగా హింస చెలరేగడంతో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు నిప్పు పెట్టారు. దీంతో జిల్లా కేంద్రమైన అమలాపురంను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. 
 
ఈ నేపథ్యంలో డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, కోనసీమలో జరుగుతున్న అల్లర్ల పుకార్లపై ఎవరూ నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. అమలాపురంలో త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్దరిస్తామన్నారు. అదేసమయంలో కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై పుకార్లు నమ్మొద్దని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కోనసీమలో పోలీసు బందోబస్తు ఇంకా కొనసాగుతోందన్నారు. 
 
మంత్రి విశ్వరూపం, ఎమ్మెల్యే సతీష్ గృహాలతో పాటు కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేసిన ఘటనలై నిందితులను గుర్తించామన్నారు. అదేసమయంలో అమలాపురం పట్టణంలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30లు అమల్లో ఉన్నాయన్నారు. అందువల్ల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన హెచ్చరించాు. ఇదిలావుంటే కోనసీమ అల్లర్లు జరిగిన ఐదు రోజులైనా ఇప్పటివరకు అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించలేదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments