Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డేశ్వరంలో వింత పక్షులు.. పెద్దపెద్ద కళ్లు.. చూడటానికి భయంగొలిపే..?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (19:13 IST)
Birds
తెలుగు రాష్ట్రాల్లో వింత పాములు, జంతువులు, పక్షులు, పెద్దపులులు, చిరుతలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రజలు వాటిని చూసినప్పుడల్లా అవే హాట్ టాపిక్‌గా మారతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరంలో వింత పక్షులు కలకలం రేపాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో తిష్టవేసిన పక్షులు ఎవరైనా దగ్గరికొస్తే బుసలు కొడుతున్నాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. 
 
గుడ్లగూబను పోలిన ఈ పక్షులను చూసి స్థానికులు భయపడుతున్నారు. పెద్దపెద్ద కళ్లతో చూడటానికి భయంగొలిపే రీతిలో ఉన్నాయని చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితమే భవనంలో పక్షులు గూడు కట్టుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వాటి తల్లి రాత్రి సమయంలో వచ్చి వెళ్తుందని చూసినవారు చెప్తున్నారు. 
 
దీనిపై స్పందించిన భవన యజమాని.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు వాటిని తీసుకెళ్లొచ్చని తెలిపారు. పక్షులు చిన్నవిగా ఉండటంతో వాటిని బయటపడేయానికి వెనకాడుతున్నట్లు చెప్పారు. చాలామంది వాటిని గుడ్లగూబ పిల్లలుగానే అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments