వడ్డేశ్వరంలో వింత పక్షులు.. పెద్దపెద్ద కళ్లు.. చూడటానికి భయంగొలిపే..?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (19:13 IST)
Birds
తెలుగు రాష్ట్రాల్లో వింత పాములు, జంతువులు, పక్షులు, పెద్దపులులు, చిరుతలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రజలు వాటిని చూసినప్పుడల్లా అవే హాట్ టాపిక్‌గా మారతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరంలో వింత పక్షులు కలకలం రేపాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో తిష్టవేసిన పక్షులు ఎవరైనా దగ్గరికొస్తే బుసలు కొడుతున్నాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. 
 
గుడ్లగూబను పోలిన ఈ పక్షులను చూసి స్థానికులు భయపడుతున్నారు. పెద్దపెద్ద కళ్లతో చూడటానికి భయంగొలిపే రీతిలో ఉన్నాయని చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితమే భవనంలో పక్షులు గూడు కట్టుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వాటి తల్లి రాత్రి సమయంలో వచ్చి వెళ్తుందని చూసినవారు చెప్తున్నారు. 
 
దీనిపై స్పందించిన భవన యజమాని.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు వాటిని తీసుకెళ్లొచ్చని తెలిపారు. పక్షులు చిన్నవిగా ఉండటంతో వాటిని బయటపడేయానికి వెనకాడుతున్నట్లు చెప్పారు. చాలామంది వాటిని గుడ్లగూబ పిల్లలుగానే అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments