Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డేశ్వరంలో వింత పక్షులు.. పెద్దపెద్ద కళ్లు.. చూడటానికి భయంగొలిపే..?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (19:13 IST)
Birds
తెలుగు రాష్ట్రాల్లో వింత పాములు, జంతువులు, పక్షులు, పెద్దపులులు, చిరుతలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రజలు వాటిని చూసినప్పుడల్లా అవే హాట్ టాపిక్‌గా మారతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరంలో వింత పక్షులు కలకలం రేపాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో తిష్టవేసిన పక్షులు ఎవరైనా దగ్గరికొస్తే బుసలు కొడుతున్నాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. 
 
గుడ్లగూబను పోలిన ఈ పక్షులను చూసి స్థానికులు భయపడుతున్నారు. పెద్దపెద్ద కళ్లతో చూడటానికి భయంగొలిపే రీతిలో ఉన్నాయని చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితమే భవనంలో పక్షులు గూడు కట్టుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వాటి తల్లి రాత్రి సమయంలో వచ్చి వెళ్తుందని చూసినవారు చెప్తున్నారు. 
 
దీనిపై స్పందించిన భవన యజమాని.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు వాటిని తీసుకెళ్లొచ్చని తెలిపారు. పక్షులు చిన్నవిగా ఉండటంతో వాటిని బయటపడేయానికి వెనకాడుతున్నట్లు చెప్పారు. చాలామంది వాటిని గుడ్లగూబ పిల్లలుగానే అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments