Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి కార్యాలయంగా డిజిపి ఆఫీస్‌ : నక్కా ఆనంద్‌బాబు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:04 IST)
డిజిపి కార్యాలయం వైసిపి కార్యాలయంగా మారిపోయిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు.

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి హత్యయత్నానికి వెళ్లిన ఎమ్మెల్యేకు 151 నోటీస్‌ ఇచ్చి పంపారన్నారు. తమ నాయకులపై మాత్రం ఎస్సి,ఎస్టి కేసు పెట్టారని తెలిపారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి విన్నవించేది ఏముంటుందని ఆయన నిలదీశారు. ఈ దారుణంపై పోలీస్‌ వ్యవస్థ సిగ్గుపడాలని నక్కా పేర్కొన్నారు.
 
గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న విపరీణమలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా?, వ్యవస్దలు పనిచేస్తు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్ష నాయకుడి ఇంటికి దాడి వెళ్ళి మళ్ళీ దానిని సమర్దించుకోవడం సిగ్గు మాలిన చర్యన్నారు. పోలీసులు వాళ్ళ చర్యలను సమర్దించడం దుర్మార్గమన్నారు. డీజీపీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేసుకోవాలన్నారు.

నా భూతో.. నా భవిష్యతు అన్నట్టు ఈ ప్రభుత్వంలో ఎన్ని భూతులు తిడితే.. మీ భవిష్యతు అంతా బాగుంటుంది అనే రీతిలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యంగం ఇచ్చిన జీవించే హక్కును హరిస్తుందని మండిపడ్డారు.

టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్  మరియు ఆ రోజు దాడికి వచ్చిన వారిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments