Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలో సర్వదర్శనం టోకెన్లకు ఎగబడిన భక్తులు...

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (11:18 IST)
తిరుమలలో భక్తుల తోపులాట జరిగింది. సర్వదర్శన టిక్కెట్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో ఈ తోపులాట సంభవించింది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేశారు. దీంతో ఈ టోకన్ల కోసం భక్తులు తమ చంటి బిడ్డలతో కలిసి క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే, ఒక్కసారిగా భక్తులు టోకెన్లకు ఎగబడటంతో తోపులాట జరిగింది. 
 
రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లను భక్తులు పంపిణీ చేశారు. అయితే గోవిందరాజస్వామి సత్రం వద్ద వేచివున్న భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 
 
తితిదే విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. మరోవైుపు తోపులాటలో గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఈ సర్వదర్శన టోకెన్లను అధిక ధరకు తితిదే అధికారులు, సిబ్బంది బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

తిరుమల వెంకన్నను దర్శించుకున్న త్రివిక్రమ్.. పవన్ కోసమేనా? (Video)

కుర్రకారుని కైపుగా వెక్కిరిస్తున్న రష్మిక మందన్నా

డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప-2' దిరూల్‌ విడుదల

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments