Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కిరిసిన భక్తజనం.. తిరుమలలో అపశృతి.. భక్తుడు మృతి

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (11:07 IST)
శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్‌లో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనాన్ని రద్దు చేసి.. క్యూలైన్లలో నేరుగా భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. కిక్కిరిసిన భక్తజనం కారణంగా తిరుమల దర్శన క్యూలైన్‌లో వేచియున్న భక్తుడు మృతిచెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వేదాచలం అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్‌లో సృహ తప్పి పడిపోయిన వేదాచలం అనే భక్తుడు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
 
క్యూలైన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక వేదాచలం కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
కానీ, మార్గ మధ్యలోనే వేదాచలం మృతి చెందాడు. ఆస్పత్రిలో అతన్ని పరిక్షించిన వైద్యులు అతడు మరణించినట్టు ధృవీకరించారు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 
 
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వేదాచలం కిందపడిన వెంటనే బయటకు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందంటూ వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments