Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కిరిసిన భక్తజనం.. తిరుమలలో అపశృతి.. భక్తుడు మృతి

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (11:07 IST)
శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్‌లో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనాన్ని రద్దు చేసి.. క్యూలైన్లలో నేరుగా భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. కిక్కిరిసిన భక్తజనం కారణంగా తిరుమల దర్శన క్యూలైన్‌లో వేచియున్న భక్తుడు మృతిచెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వేదాచలం అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్‌లో సృహ తప్పి పడిపోయిన వేదాచలం అనే భక్తుడు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
 
క్యూలైన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక వేదాచలం కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
కానీ, మార్గ మధ్యలోనే వేదాచలం మృతి చెందాడు. ఆస్పత్రిలో అతన్ని పరిక్షించిన వైద్యులు అతడు మరణించినట్టు ధృవీకరించారు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 
 
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వేదాచలం కిందపడిన వెంటనే బయటకు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందంటూ వాపోయారు. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments