Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూఎస్ ర్యాంకు 200 లోపు ఉంటేనే విదేశీ విద్యా సాయం : మంత్రి నాగార్జున

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (09:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులకు విదేశీ విద్యా సాయంలో మెలిక పెట్టింది. క్యూఎస్‌ ర్యాంకు 200లోపు ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకే 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. 
 
క్యూఎస్‌ ర్యాంకుల్లో మొదటి వంద స్థానాల్లోని వర్సిటీల్లో సీట్లు సాధించిన వారికి పూర్తిగా ఫీజు చెల్లిస్తామని, 100-200 మధ్య ర్యాంకుల్లో ఉన్న వాటిలో ప్రవేశాలు పొందిన వారికి రూ.50 లక్షల వరకు ఫీజు చెల్లిస్తామని వెల్లడించారు. 
 
సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'గతంలో ఈ పథకానికి రూ.6 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచాం. విదేశీ వర్సిటీల్లో సీట్లు పొందేందుకు అవసరమైతే ఎస్సీ, ఎస్టీలకు శిక్షణ ఇస్తామన్నారు. 
 
గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో లోపాలున్నట్లు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ విచారణలో తేలింది. 2016-17లో ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను చెల్లించలేదు' అని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments