Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత దేవినేని ఉమ అరెస్ట్.. అశోక్ బాబును కలిసేందుకు వెళ్తే..?

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:51 IST)
టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం రాత్రి అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో శుక్రవారం ఉదయం అయనను కలిసేందుకు దేవినేని వెళ్లారు. కానీ… పోలీసులు అనుమతించలేదు. వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు దేవినేని. దీంతో పోలీసులు అరెస్ట్ చేయక తప్పలేదు. 
 
మరోవైపు.. ఉదయం కూడా అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన అడ్వకేట్లను కూడా పోలీసులు అనుతించలేదు. గుంటూరు జీజీహెచ్‌లో అశోక్‌బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. 
 
అశోక్ బాబు అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిందని ఆరోపించారు. 
 
అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మెహర్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 
 
ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్‌ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments