Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్‌లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

రాజస్థాన్‌లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
, శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (19:16 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి బంధువు ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాష్ట్రంలోని జలోర్‌లోని లేటా గ్రామానికి చెందిన నారాయణ్ మేఘావాల్ (25) అనే వ్యక్తి బాధితురాలి తండ్రితో కలిసి వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఈ బాలిక అరుపులు విన్న కన్నతండ్రి... ఆమె కోసం ఇంట్లోకి పరుగెత్తాడు. అయితే అప్పటికే ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ బిగ్గరగా ఏడ్వసాగింది. దీంతో మేఘవాల్‌ అక్కడ నుంచి పారిపోయాడు. 
 
దీనిపై బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కామాంధుడు మేఘవాల్‌ను కేవలం రెండు గంటల్లోనే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీనామాకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే రోజా.. కారణం ఏంటంటే?