Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం.. మాటువేసి కన్నబిడ్డ కళ్లెదుటే తండ్రి హత్య

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:35 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కన్నబిడ్డ కళ్ళెదుటే తండ్రిని హత్య చేశారు కొందరు దుండగులు. ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అక్బరుద్దీన్ ‌(40) అనే వ్యక్తి ఆ రాష్ట్ర రవాణా సంస్థలో పని చేస్తున్నాడు. ఈయన ఆదివారం రాత్రి తన ఐదేళ్ళ కుమారుడు, సోదరితో కలిసి తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. 
 
అతని ఇంటికి సమీపంలో మాటు వేసిన ఐదుగురు దుండగులు.. అక్బరుద్దీన్ రాగానే కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుమారుడు.. వేగంగా తన ఇంటికి పరుగెత్తి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అంతలోనే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్బరుద్దీన్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వారే అతడిని హత్య చేశారని, ఇందుకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుల తల్లి కూడా అక్కడే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments