Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం.. మాటువేసి కన్నబిడ్డ కళ్లెదుటే తండ్రి హత్య

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:35 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కన్నబిడ్డ కళ్ళెదుటే తండ్రిని హత్య చేశారు కొందరు దుండగులు. ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అక్బరుద్దీన్ ‌(40) అనే వ్యక్తి ఆ రాష్ట్ర రవాణా సంస్థలో పని చేస్తున్నాడు. ఈయన ఆదివారం రాత్రి తన ఐదేళ్ళ కుమారుడు, సోదరితో కలిసి తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. 
 
అతని ఇంటికి సమీపంలో మాటు వేసిన ఐదుగురు దుండగులు.. అక్బరుద్దీన్ రాగానే కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుమారుడు.. వేగంగా తన ఇంటికి పరుగెత్తి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అంతలోనే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్బరుద్దీన్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వారే అతడిని హత్య చేశారని, ఇందుకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుల తల్లి కూడా అక్కడే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments