Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తా : వైఎస్. జగన్మోహన్ రెడ్డి

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే తాను చరిత్ర సృష్టిస్తానని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన తండ్రి వైఎస్ఆర్‌ను గుర్తుకు తెచ్చేలా పాలన సాగిస్తానని చెప్పారు. 
 
ఆయన తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భవిష్యత్‌ కోసం ప్రజల ఆశా, ఆకాంక్షలే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గుదాం అనుకుంటున్నా చంద్రబాబుని పన్నాగాన్ని ఏపీ ప్రజలు తప్పకుండా తిప్పికొడతారని జగన్ మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు.
 
అసలు హైదరాబాద్‌నూ చంద్రబాబు నిర్మించనే లేదు ఇటు అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్ విమర్శించారు. ఏ పార్టీతోనూ తమకు పొత్తుగానీ, సాన్నిహిత్యంగానీ లేదన్నారు. కానీ ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని తేల్చి చెప్పారు. 
 
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు, జాతీయస్థాయి రాజకీయాలపై జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నేనిప్పుడు నా ప్రజలకు ఎంతమేర మంచి చేయాలన్న దాని గురించే ఆలోచిస్తున్నని ప్రస్తుతం కూడా అదే ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు నమ్మేపరిస్థితే లేదని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments