Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా వివాదం : సీఎం జగన్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (16:07 IST)
వైకాపా పార్టీ పేరు వివాదంపై ఢిల్లీ హైకోర్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు పంపించింది. 
 
'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. 
 
ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, తమదే నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మహబూబ్ బాషా కోర్టుకు తెలిపారు. 
 
'వైఎస్సార్' పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్' ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తమ పార్టీ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఆయన ఆరోపించారు. 
 
వైఎస్. జగన్ అధ్యక్షుడిగా వున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 
 
దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సెప్టెంబరు 3లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ, కేసు విచారణను వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments