Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే మెట్ల మార్గంలో కొండచిలువ.. పరుగులు పెట్టిన భక్తులు

తిరుమల తిరుపతి శ్రీవారిని చేరుకునే మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కనిపించింది. దీన్ని చూసిన శ్రీవారి భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ కొండ చిలువ పొడవు 15 అడుగుల వరకు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చె

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (08:47 IST)
తిరుమల తిరుపతి శ్రీవారిని చేరుకునే మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కనిపించింది. దీన్ని చూసిన శ్రీవారి భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ కొండ చిలువ పొడవు 15 అడుగుల వరకు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ కొండ చిలువ 3,300 మెట్ల దగ్గర కనిపించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... తిరుమలలో సోమవారం వర్షం కురిసింది. శ్రీవారి కనుమల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అడవిలోని ఏమూల నుంచి వచ్చిందో కానీ... సుమారు 15 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువ తిరుమలలో శ్రీవారిని సమీపించే 3,300 మెట్ల దగ్గరకు నెమ్మదిగా పాక్కుంటూ వచ్చింది. 
 
మట్టి తిందో లేక ఇంకేదైనా తిందో కానీ కదలలేక కదులుతూ మెట్ల మార్గంలో వెళ్లే భక్తులను భయపెట్టింది. దీంతో పలువురు యువకులు కొండచిలువ ఫోటోలు, వీడియో తీసి తిరుమల అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి, దానిని పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లారు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments