బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:36 IST)
బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌ను పోలిన నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ... సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురు గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా పని చేస్తుండగా... ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని చెప్పారు. పోరంకి, పెనమలూరులో ఉంటారని తెలిపారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని... మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన వారిని త్వరగా అంత్య క్రియలు చేశారని ఆయన చెప్పారు.
 
కంచికచెర్లలో ఇద్దరు వృద్ధ దంపతులను ఇలాగే హత్య చేశారన్నారు. ఇప్పటి దాకా ఐదు కేసుల్లో ఆరుగురిని హత్య చేసినట్లు తెలిపారు. 12న పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని... సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేశామని తెలిపారు. కంచికచర్ల కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో మొత్తం కేసులు బయటపడ్డాయన్నారు. వీళ్ళు చేసిన నేరాలలో హత్య జరిగినట్టు బాధితులకే తెలీకపోవడం గమనార్హమని చెప్పుకొచ్చారు. ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండే ఇళ్ళనే టార్గెట్ చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments