బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:36 IST)
బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌ను పోలిన నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ... సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురు గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా పని చేస్తుండగా... ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని చెప్పారు. పోరంకి, పెనమలూరులో ఉంటారని తెలిపారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని... మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన వారిని త్వరగా అంత్య క్రియలు చేశారని ఆయన చెప్పారు.
 
కంచికచెర్లలో ఇద్దరు వృద్ధ దంపతులను ఇలాగే హత్య చేశారన్నారు. ఇప్పటి దాకా ఐదు కేసుల్లో ఆరుగురిని హత్య చేసినట్లు తెలిపారు. 12న పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని... సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేశామని తెలిపారు. కంచికచర్ల కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో మొత్తం కేసులు బయటపడ్డాయన్నారు. వీళ్ళు చేసిన నేరాలలో హత్య జరిగినట్టు బాధితులకే తెలీకపోవడం గమనార్హమని చెప్పుకొచ్చారు. ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండే ఇళ్ళనే టార్గెట్ చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: శక్తిమాన్ గా అల్లు అర్జున్ ను బాసిల్ జోసెఫ్ చూపించనున్నాడా?

Sandhigdham: సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : పార్ధసారథి

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

తర్వాతి కథనం
Show comments