Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతి ప్రజ్వలనకు నిరాకరించిన సీఎం జగన్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (14:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఇటీవల అమెరికాలో పర్యటనకు వెళ్లారు. తన కుటుంబ సమేతంగా ఆయన యూఎస్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన డల్లాస్‌లో జరిగిన ఓ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు జగన్‌తో జ్యోతి ప్రజ్వలన చేయించడానిక నిర్వాహుకులు పడిన శ్రమ అంతాఇంతాకాదు. అయినా సరే జగన్ మాత్రం జ్యోతి ప్రజ్వలనకు నిరాకరించారు. 
 
నిజానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహన రెడ్డికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పూజలు, యజ్ఞాలు, యాగాలు చేశారు. మరిప్పుడు డల్లాస్‌లో జరిగిన సభలో జ్యోతిప్రజ్వలన చేయడానికి జగనన్న ఇష్టపడలేదు. 
 
సాధారణంగా ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు జ్యోతి వెలిగించడం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఒక మంచి పనిని ప్రారంభించేటప్పుడు అది నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ యావత్ భారతజాతి జ్యోతిని వెలిగిస్తుంది. అటువంటి దివ్య హైందవ సంప్రదాయాన్ని నిర్వాహకులు బతిమాలుతున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం నిరాకరించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments