Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 రోజుల పసికందుకు వాతలు.. ఎందుకు పెట్టారో తెలుసా...?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:38 IST)
టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు మూఢనమ్మకాలతో పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ పనుల వలన ప్రమాదం ఏమీ లేనట్లయితే ఎవరి నమ్మకాలు వారివి అని వదిలేయచ్చు, కానీ వాటి వలన ప్రాణాలే పోతున్న తరుణంలో వీటిపై అవగాహన కల్పించడం అనివార్యం. 
 
ప్రభుత్వం, అధికారులు ఎన్ని అవగాహన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక గిరిజనులలో ఈ నమ్మకాలు చాలా లోతుగా నాటుకుపోయాయి. అటవీ ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
 
ఇటీవల విజయనగరంలోని ఊబిగుడ్డి గిరిజన గ్రామానికి చెందిన పాడి నర్సమ్మకు జనవరి 25వ తేదీన ఆడబిడ్డ జన్మించింది. పుట్టిన అయిదు రోజుల తర్వాత బిడ్డ అస్వస్థతకు గురై ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది, ఇంకా పచ్చ కామెర్ల లక్షణాలు కూడా కనిపించడంతో భయపడిన తల్లిదండ్రులు మంత్రసానిని కలిశారు. 
 
ఆమె సూచనల మేరకు చిన్నారికి కడుపు చుట్టూ, చెవి దగ్గర, నదురు, చేయిపై సూదిని కాల్చి వాతలు పెట్టారు. పరిస్థితి చేజారడంతో ప్రాథమిక ఆసుపత్రిలో చేర్చగా ఎనుప సూది వలన ఇన్ఫెక్షన్ సోకిందని, ఇంకా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం వలన ఆక్సిజన్ ఉంచామని, ప్రస్తుత కండీషన్‌పై స్పష్టత ఇవ్వలేమని తెలిపారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments