Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి భవనాన్ని కూడా వదల్లేదు.. వైకాపా రంగులు వేసేశారు..

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (07:59 IST)
ఏపీలోని అధికార పార్టీ నేతలకు రంగుల పిచ్చిపట్టింది. అందుకే ప్రభుత్వ భవనాలను ఇష్టానుసారంగా తమ పార్టీ జెండాలోని మూడు రంగులు వేస్తున్నారు. ఈ రంగులు వేయొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మొత్తుకున్నప్పటికీ వైకాపా నాయకులు మాత్రం పెడచెవిన పెట్టేస్తున్నారు. తాజాగా బాపట్లలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు వైకాపా రంగులు వేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ప్రాంతీయ ఆసుపత్రిని రూ.3.50 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ పతాకాల రంగులు వేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు ఆసుపత్రి భవనాలకు అధికార పార్టీ పతాకం స్ఫురించేలా రంగులు వేయించటంపై రోగులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థను ప్రశ్నించగా.. ఆసుపత్రిలో పనులు ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. సంస్థ ఉన్నతాధికారులు నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ప్రాంతీయ వైద్యశాల భవనాలకు గుత్తేదారుతో రంగులు వేయించినట్లు ఇంజినీర్లు తెలిపారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments