Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి భవనాన్ని కూడా వదల్లేదు.. వైకాపా రంగులు వేసేశారు..

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (07:59 IST)
ఏపీలోని అధికార పార్టీ నేతలకు రంగుల పిచ్చిపట్టింది. అందుకే ప్రభుత్వ భవనాలను ఇష్టానుసారంగా తమ పార్టీ జెండాలోని మూడు రంగులు వేస్తున్నారు. ఈ రంగులు వేయొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మొత్తుకున్నప్పటికీ వైకాపా నాయకులు మాత్రం పెడచెవిన పెట్టేస్తున్నారు. తాజాగా బాపట్లలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు వైకాపా రంగులు వేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ప్రాంతీయ ఆసుపత్రిని రూ.3.50 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ పతాకాల రంగులు వేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు ఆసుపత్రి భవనాలకు అధికార పార్టీ పతాకం స్ఫురించేలా రంగులు వేయించటంపై రోగులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థను ప్రశ్నించగా.. ఆసుపత్రిలో పనులు ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. సంస్థ ఉన్నతాధికారులు నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ప్రాంతీయ వైద్యశాల భవనాలకు గుత్తేదారుతో రంగులు వేయించినట్లు ఇంజినీర్లు తెలిపారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments