Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ శాసనమండలిలో ప్రాతినిథ్యం కోల్పోయిన బీజేపీ.. మారనున్న సంఖ్యాబలం

Advertiesment
aplegislativecouncil
, శుక్రవారం, 24 మార్చి 2023 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారిపోయాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతం 33 నుంచి (గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి) 44కు చేరుతుంది. 
 
ప్రతిపక్ష తెదేపా సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం ఐదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. భాజపాకు ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిథ్యం కోల్పోయింది.
 
అయితే, తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2.. మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైకాపా, 4 స్థానాలు తెదేపా దక్కించుకున్నాయి.
 
తెదేపాకు చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు. వైకాపాకు చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ అభ్యర్థి అనురాధను గెలిపించిన వైకాపా ఎమ్మెల్యేలు.. గుర్తించామన్న సజ్జల