Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు - భవనమెక్కి టీడీపీ సభ్యుల ఆందోళన

ap assembly
, మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో భాగంగా, మంగళవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. అయితే, అధికార వైకాపా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి తెలుగుదేశం పార్టీ నేతలు యత్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులు అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. 
 
భవనంపై ఆందోళనకు దిగిన నేతల్లో కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. 
 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా భవనం నుంచి పైనుంచి కింద దించారు. వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ 2022 తేదీల వెల్లడి