రాపాక అమ్ముడు పోయిన సరకు... రూ.10 కోట్లా? రూ.10 వేలే ఎక్కువ : బొండా ఉమ

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (21:43 IST)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలను తనను సంప్రదించి టీడీపీ అభ్యర్థిగా ఓటు వేయాల్సిందిగా డబ్బు ఆఫర్ చేశారంటూ జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేరిన రాపాక వరప్రసాద్ చేసిన ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ ఘాటుగా స్పందించారు. "రాపాక ఇప్పటికే అమ్ముడు పోయిన సరుకు. నిన్ను ఆల్రెడీ కొనేశారు నాయనా... దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్‌టు వైకాపా" అని బోర్డు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందువల్ల "నువ్వుగానీ, నీలాంటి వైకాపా ఎమ్మెల్యేలు కానీ టీడీపీకి ఎందుకు.. దీనిపై సూటిగా సమాధానం చెప్పు" అంటూ రాపాకను ఆయన నిలదీశారు. 
 
తాడేపల్లి ప్యాలెస్ నుంచిన స్క్రిప్టునే రాపాక చదివారని బొండా ఉమ ఆరోపించారు. రాపాక ఓ చిల్లర మనిషి అని, జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపాకు అమ్ముడు పోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ నీతులు చెబుతున్నాడంటూ మండిపడ్డారు. పైగా, రాపాకను కొనాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. టీడీపీకి కావాల్సిన 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయని బొండా ఉమ పేర్కొన్నారు. రాపాకను రూ.10 కోట్లు పెట్టి కొనేది ఎవరు అని, అతడికి రూ.10 వేలు కూడా ఎక్కువేనని బొండా ఉమ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments