Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాపాక అమ్ముడు పోయిన సరకు... రూ.10 కోట్లా? రూ.10 వేలే ఎక్కువ : బొండా ఉమ

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (21:43 IST)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలను తనను సంప్రదించి టీడీపీ అభ్యర్థిగా ఓటు వేయాల్సిందిగా డబ్బు ఆఫర్ చేశారంటూ జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేరిన రాపాక వరప్రసాద్ చేసిన ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ ఘాటుగా స్పందించారు. "రాపాక ఇప్పటికే అమ్ముడు పోయిన సరుకు. నిన్ను ఆల్రెడీ కొనేశారు నాయనా... దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్‌టు వైకాపా" అని బోర్డు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందువల్ల "నువ్వుగానీ, నీలాంటి వైకాపా ఎమ్మెల్యేలు కానీ టీడీపీకి ఎందుకు.. దీనిపై సూటిగా సమాధానం చెప్పు" అంటూ రాపాకను ఆయన నిలదీశారు. 
 
తాడేపల్లి ప్యాలెస్ నుంచిన స్క్రిప్టునే రాపాక చదివారని బొండా ఉమ ఆరోపించారు. రాపాక ఓ చిల్లర మనిషి అని, జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపాకు అమ్ముడు పోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ నీతులు చెబుతున్నాడంటూ మండిపడ్డారు. పైగా, రాపాకను కొనాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. టీడీపీకి కావాల్సిన 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయని బొండా ఉమ పేర్కొన్నారు. రాపాకను రూ.10 కోట్లు పెట్టి కొనేది ఎవరు అని, అతడికి రూ.10 వేలు కూడా ఎక్కువేనని బొండా ఉమ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments