Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్డీయే అధికారులకు కనువిప్పు... రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో శుభ్రతా చర్యలు

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించింది. దీంతో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సాథ్యంలోని వైకాపా ప్రభుత్వం దిగిపోయింది. త్వరలోనే టీడీపీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారుల వైఖరిలో మార్పును శ్రీకారం చుట్టింది. 
 
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో రాజధానిలో మార్పు మొదలైంది. వైకాపా పాలనలో గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసిన సీఆర్డీఏ.. ప్రస్తుతం అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది. 
 
అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారిని అద్దంలా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. రహదారిపై ఉన్న విద్యుత్తు దీపాలకు మరమ్మతులు చేయిస్తున్నారు. ప్రస్తుతం శంకుస్థాపన ప్రాంతంలో సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments