Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటేజ్ రైలు పక్కన సెల్ఫీకి యత్నించిన యువతి దుర్మరణం!!

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (09:03 IST)
నేటి యువతి సెల్ఫీల మోజుతో ఎంతో విలువైన తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వింటేజ్ రైలు వస్తుండగా దాని పక్కన నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. స్టీమ్ ఇంజిన్‌తో నడిచే రైలింజిన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదకర ఘటన మెక్సికోలోని హిడాల్కో ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెక్సికోలోని హిడాల్కోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. రైలు సమీపించే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరకు జరిగింది. ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనపై ఆమె తల భాగంలో తీవ్రంగా గాయం కావడంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలు చూసిన ఇతరు ఔత్సాహికులు అక్కడ నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments