Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్‌ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా సిపిఎం ఉద్యమం... 31 తరువాత కార్యాచరణ

Webdunia
బుధవారం, 20 మే 2020 (09:49 IST)
విద్యుత్‌ ఛార్జీలు పెంపుకు వ్యతిరేకంగా ఈ నెల 31 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. కేంద్ర విద్యుత్‌ చట్టానికి సవరణలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం ఏమిటో ఇంతవరకు ప్రకటించలేదని తెలిపారు.

ప్రకటన చేయకపోతే ఉమ్మడి కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుందని, గతంలో మాదిరిగా విద్యుత్‌ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావుతో కలిసి ఆయన మాట్లాడారు.

విద్యుత్‌ ధరలను నెలవారీ శ్లాబులుగా నిర్ణయించినందున వినియోగాన్ని బట్టి ఏ నెలకానెల ధరలు మారుతుంటాయని, దీనివల్ల ఎక్కువ మంది పేదలు నష్టపోతారని తెలిపారు.

దీనిపై నిరసన వ్యక్తం చేసేందుకు వస్తే పోలీసులు కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేసి రిమాండుకు పంపిస్తే న్యాయమూర్తి పోలీసులకు చీవాట్లు పెట్టారన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments