Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింహాచలం ఆలయంలో పాము

Advertiesment
Snake
లాక్‌డౌన్‌తో పలు దేవాలయాల్లో భక్తుల ప్రవేశాన్ని నిషేధించడంతో..వన్య ప్రాణులు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇటీవల శ్రీశైలం మార్గంలో నెమళ్లు సంచరించిన సంగతి తెలిసిందే.

తాజాగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి 9 అడుగులకు పైగా ఉన్న పాము ఒకటి ప్రవేశించింది. తొమ్మిది అడుగుల పొడవున్న ఈ విషసర్పాన్ని ఆలయ ఉప ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు ఒడుపుగా పట్టుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఆలయంలోకి పాములు తరచూ వస్తూనే ఉంటాయని, కానీ సీతారామాచార్యులు వాటిని చాకచక్యంగా పట్టుకుని దూరంగా తోటల్లో వదిలేస్తారని సిబ్బంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విపత్కర సమయంలో ఆపద్బాంధవి ‘108’.. పేషెంట్లకు వెన్నుదన్నుగా అంబులెన్సులు