Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర రాష్ట్రాల మధ్య బ్రోకర్‌గా ఏపీ గవర్నర్ : సీపీఐ నారాయణ

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (15:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏపీ గవర్నర్ ఒక బ్రోకర్‌గా మారిపోయారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. గవర్నరుగా ఉన్న హరిచందన్ వంటి వ్యక్తుల వల్ల మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతోందని నారాయణ అన్నారు. 
 
ఆయన మంగళవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హెడ్ క్లర్క్‌గా మారిపోయారని మండిపడ్డారు. అంతటితో ఆగని నారాయణ కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఓ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా, ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన హరిచందన్‌కు కేంద్ర ప్రభుత్వం ఏపీ గవర్నరుగా నియమించింది. అప్పటి నుంచి ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన విధులను ప్రశాంతంగా చేసుకుంటూ పోతున్నారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకునే అనేక వివాదాస్పద నిర్ణయాలకు గవర్నర్ కేంద్రబిందువుగా మారారు. ఫలితంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments