Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర రాష్ట్రాల మధ్య బ్రోకర్‌గా ఏపీ గవర్నర్ : సీపీఐ నారాయణ

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (15:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏపీ గవర్నర్ ఒక బ్రోకర్‌గా మారిపోయారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. గవర్నరుగా ఉన్న హరిచందన్ వంటి వ్యక్తుల వల్ల మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతోందని నారాయణ అన్నారు. 
 
ఆయన మంగళవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హెడ్ క్లర్క్‌గా మారిపోయారని మండిపడ్డారు. అంతటితో ఆగని నారాయణ కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఓ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా, ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన హరిచందన్‌కు కేంద్ర ప్రభుత్వం ఏపీ గవర్నరుగా నియమించింది. అప్పటి నుంచి ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన విధులను ప్రశాంతంగా చేసుకుంటూ పోతున్నారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకునే అనేక వివాదాస్పద నిర్ణయాలకు గవర్నర్ కేంద్రబిందువుగా మారారు. ఫలితంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments