Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర రాష్ట్రాల మధ్య బ్రోకర్‌గా ఏపీ గవర్నర్ : సీపీఐ నారాయణ

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (15:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏపీ గవర్నర్ ఒక బ్రోకర్‌గా మారిపోయారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. గవర్నరుగా ఉన్న హరిచందన్ వంటి వ్యక్తుల వల్ల మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతోందని నారాయణ అన్నారు. 
 
ఆయన మంగళవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హెడ్ క్లర్క్‌గా మారిపోయారని మండిపడ్డారు. అంతటితో ఆగని నారాయణ కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఓ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా, ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన హరిచందన్‌కు కేంద్ర ప్రభుత్వం ఏపీ గవర్నరుగా నియమించింది. అప్పటి నుంచి ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన విధులను ప్రశాంతంగా చేసుకుంటూ పోతున్నారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకునే అనేక వివాదాస్పద నిర్ణయాలకు గవర్నర్ కేంద్రబిందువుగా మారారు. ఫలితంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments