Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ

వరుణ్
బుధవారం, 3 జులై 2024 (10:44 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలను సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ వివరించారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని, అది లేకపోవడం వల్లే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందన్నారు. బీజేపీతో ఉంటే ఉన్నామని, లేకపోతే లేమని జగన్ స్పష్టంగా చెప్పలేకపోయారన్నారు. ఆయన తటస్థ స్టాండ్ తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 
 
అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందని, అంతే తప్ప ఓట్ల శాతం ఆధారంగా కాదని గుర్తు చేశారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్లే వైసీపీ 11 స్థానాలకు పరిమితమైందన్నారు. ఇక న్యూట్రల్ స్టాండ్ వల్ల జగన్ మాత్రమే కాదని కేసీఆర్, నవీన్ పట్నాయక్ కూడా తీవ్రంగా నష్టపోయారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీతో కలిసి వెళ్లాలనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం వాళ్ల వరకూ కరెక్టేనని నారాయణ అన్నారు. 
 
కాగా, టీడీపీ కూటమిలో పవన్ డైనమిక్ పాత్ర పోషించారన్నారు. ఆయనకు ఉన్న సినిమా చరిష్మా ఎన్నికల్లో ప్లస్ అయిందన్నారు. అందుకే పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన గెలిచిందని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించామని చెప్పిన ఆయన.. జగన్ హయాంలో ప్రజాస్వామ్యం దెబ్బతిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న రుషికొండ భవనాల నిర్మాణంపై కూడా నారాయణ స్పందించారు. ఈ భవనాలను నిర్మించేటప్పుడు ప్రతిపక్ష నేతలను వైసీపీ ప్రభుత్వం అక్కడకు వెళ్లనీయలేదన్నారు. ఈ భవనాల్ని కూటమి ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాలని నారాయణ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments