Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ పథకాలకు జగన్ పంగనామాలు పెట్టారు: సీపీఐ నారాయణ

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:49 IST)
దివంగత ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొని వచ్చిన పథకాలకు జగన్ సర్కారు పంగనామాలు పెడుతుందని సీపీఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. గతంలో ఉచిత విద్యుత్  కోసం వైఎస్సార్ పోరాటం చేసి దాన్ని అమలులోనికి తెచ్చారని, కాని జగన్ సర్కారు దాన్ని ఎత్తివేసేందుకు కోతలు పెడుతుందని తెలిపారు.
 
ఎన్నికల్లో మాట తప్పడు, మడమ తిప్పడు అన్న జగన్ ఇప్పుడు ఉచిత విద్యుత్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గుతున్నారని సీపీఐ నారాయణ ఆక్షేపించారు. ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను పెట్టాలంటున్న జగన్ నిర్ణయం సరికాదన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం వెనక్కి తగ్గడమే అన్నారు.
 
గతంలో వైఎస్ ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేసినప్పుడు అప్పట్లో సీపీఐ కూడా కాంగ్రెస్‌తో కలిసి ఇందుకోసం పోరాడింది. ఆ తరువాత వైఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను అమల్లోనికి తెచ్చారు. కానీ ప్రస్తుత వైసీపీ సర్కారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు లొంగి ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది.
 
నగదు బదిలీ చేస్తామని హామీలు ఇస్తున్నా రైతుల్లో మాత్రం అనుమానాలు తొలగలేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై వామపక్షాలు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments