Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వైతాళికులను నిర్లక్ష్యం చేసిన ఆంధ్ర పాలకులు: మంత్రి కేటీఆర్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:41 IST)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తుల జయంతి ఉత్సవాలను తగిన రీతిలో నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి రామారావు అన్నారు. మాజీ ప్రధాని పి.వి నరసింహరావుతో సహా పలువురు తెలంగాణ ప్రముఖ వ్యక్తులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు గౌరవించలేదని వారిని విస్మరించారని తెలిపారు.
 
భారత మాజీ ప్రధాని పి.వి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా పీవికి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. కేంద్ర ప్రభుత్వం పీవికి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. పీవి ఒక్కరే కాదు తెలంగాణకు చెందిన ఎంతోమంది వైతాళికులను మరిచిపోయారని, వారి ఉనికి మరుగునపడిందని తెలిపారు. వారిని గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
 
పీ.వి నరసింహరావు అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. భూ సంస్కరణలు మొదలు పెట్టిన పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పినా ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. పివి అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు పురస్కారాలు తెచ్చిపెట్టిందన్నారు.
 
రాష్ట్ర ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయిందని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈశ్వరీబాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, కొమరయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ వంటి ఎందరినో తెలంగాణ సాంస్కృతిక శాఖ గౌరవించుకుందన్నారు. వీరి స్పూర్తిని భవిష్యత్ తరాల్లో నింపాలని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments