Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ లాక్ 4 సడలింపుతో ఈ నెల 21 నుంచి తాజ్‌మహాల్ సందర్శనకు అనుమతి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:35 IST)
కరోనా వైరస్ కారణంగా దేశంలోని పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్ లాక్4 లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజ్ మహాల్, ఆగ్రా పోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం ఓపెన్ కాలేదు.
 
ఈ క్రమంలో సెప్టెంబరు 21 నుంచి తాజ్ మహాల్, ఆగ్రా కోటను సందర్సకుల కోసం తిరిగి తెరవనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆగ్రా సర్కిల్ సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ రెండు ప్రపంచ వారసత్వ కట్టడాలను మార్చి 17 నుంచి మూసివేశారు.
 
అయితే ఈ రెండు ప్రాంతాలలో వేర్వేరుగా 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. దీంతో పాటు సందర్శకులకు ఎలక్ట్రానిక్ టికెట్ జారీ చేయనున్నారు. పర్యాటకులంతా కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ మేరకు అధికారులు వెల్లడించారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments