Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో కార్తీక దీపాలు వ‌ద‌ల‌బోయి... ప్రాణాలు వ‌దిలిన దంప‌తులు

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (10:18 IST)
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కాల్వలో దీపాలు వదిలేందుకు వెళ్లిన దంపతులు త‌మ నిండు ప్రాణాల‌ను వ‌దిలారు. కాలువ‌లో దీపాలు వ‌దులుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు జారిప‌డి అందులో పడి మృతి చెందారు. కర్నూలులో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. నగరంలోని అబ్బాస్ నగర్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్ (44), ఇందిర (41) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాఘవేంద్రప్రసాద్ దంపతులు తెల్లవారుజామున 5 గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు.
 
 
పూజల అనంతరం కాల్వలో దీపం వదులుతూ, ప్రమాదవశాత్తు ఇందిర అందులో పడిపోయారు. ఆమెను రక్షించే క్రమంలో భర్త రాఘవేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో వారు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జహారాపురం వద్ద వారి మృత దేహాలను గుర్తించారు. కార్తీక మాసంలో జ‌రిగిన ఈ దంప‌తుల విషాదాంతం అంద‌రినీ క‌లిచివేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments