Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికొడుకుని ముస్తాబు చేసిన బంధువులు, పెళ్ళికొడుక్కి కరోనావైరస్, చివరకు?

Webdunia
గురువారం, 23 జులై 2020 (15:07 IST)
తూర్పుగోదావరిజిల్లా కొత్తపేటలో పెళ్ళింట కరోనావైరస్ కలకలం రేపింది. కొత్తపేటకు చెందిన యువకుడికి పక్కనే ఉన్న బిల్లకుర్రుకు చెందిన యువతికి పెళ్ళి నిశ్చయమైంది. 15 రోజుల ముందు రెండు కుటుంబాలు పెళ్ళికి సంబంధించిన నిశ్చయం చేసేసుకున్నారు. రేపు పెళ్ళి జరగాల్సి ఉంది. 
 
పెళ్ళికొడుకుని సిద్ధం చేశారు బంధువులు. అయితే ఉన్నట్లుండి ఒక మెసేజ్ ఆ పెళ్ళిని ఆపేసింది. యువకుడికి కరోనావైరస్ పాజిటివ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోగా పెళ్ళికొడుకుని రెడీ చేసిన బంధువులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఇటీవల సంచార సంజీవిని బస్సులో నిర్వహించిన రాపిడ్ యాంటీజన్ కిట్ పరీక్షల్లో యువకుడు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. రేపు ఉదయం పెళ్ళి అనగా ఈరోజు మధ్యాహ్నానికి అతని మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినట్లు మెసేజ్ రావడంతో ఆంబులెన్స్ తీసుకొచ్చి పెళ్ళికొడుకుని ఆసుపత్రికి తరలించారు.
 
అతనితో పాటు అతన్ని ముందుగా ఈ రోజు ఉదయం నుంచి ముస్తాబు చేసిన బంధువులను క్వారంటైన్లకు తరలించారు. గత వారం రోజుల నుంచి కొంతమంది స్నేహితులు ఆ యువకుడితో కలిసి ఉండటంతో వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు వైద్య సిబ్బంది. పెళ్ళింట కరోనా కలకలం సృష్టించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments