Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ పాజిటివ్, ఇద్దరు కొడుకులకీ చెప్పకుండా కాలువలో దూకేశారు

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (22:43 IST)
కరోనావైరస్ ఎంతోమంది జీవితాలను ఛిద్రం చేసేస్తోంది. ఆ వైరస్ వస్తే ఇక చనిపోవడమనే నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. కనీసం చికిత్స చేయించుకునేందుకు సైతం ప్రయత్నించకుండా తనువు చాలిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ దంపతులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
తమకు కరోనా పాజిటివ్ వుందని పరీక్షల్లో తేలడంతో వృద్ధ దంపతులు భయంకరమైన వైరస్ వల్ల చనిపోతారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరిలోని రాయవరం మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కర్రి వెంకట్ రెడ్డి (71), సావిత్రి దంపతులు మండపేట కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
వ్యవసాయం ద్వారా జీవనం సాగించే వెంకట్ రెడ్డి, సావిత్రి ఈ నెల 12వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటి నుండి హోం ఐసోలేషన్లో వుంటున్నారు. వెంకట్ రెడ్డి, సావిత్రికి ఇద్దరు కుమారులు. వ్యాపార రీత్యా ఒకరు ఒడిశాలో వుంటుండగా మరొకరు రాజమండ్రిలో నివశిస్తున్నారు.
 
కాగా ఈ నెల 12వ తేదీ నుండి ఈ జంట ఇంట్లో ఒంటరిగా వుంటున్నారు. ఐతే ఒక రోజంతా ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి వారి కుమారుడికి సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రుల ఆచూకి లేదు. సాయంత్రం మండపేట కాలువలోని మాచవరం గ్రామ సమీపంలో రెండు మృతదేహాలు లభించాయని వార్త రావడంతో అక్కడికెళ్లి చూడగా వారు తమ తల్లిదండ్రులను గుర్తించాడు. కరోనా కారణంగా చనిపోతామన్న భయంతో వారు ఆత్మహత్య చేసుకుని వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments