Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకిన వృద్ధుడు రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు...

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (10:12 IST)
తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే కనీస వైద్యం అందకుండా ఓ వృద్ధుడు రోడ్డుపైనే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని లాలాపేట ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రి ఎవరూ నృద్ధుడిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోలేదు. అందరూ కరోనా లక్షణాలు వున్నాయని నిర్ధారించారు కానీ పేషంట్‌ను జాగ్రత్తగా వుంచి చికిత్స అందించలేదు. దీంతో కరోనా లక్షణాలతో నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు రోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. 
 
హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తూ నారాయణగూడ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద పడిపోయి మృతి చెందాడు. నేపాల్‌కు చెందిన ఈ 70 ఏళ్ల బహదూర్ లాలాపేటలోని ఓ బార్‌లో పని చేస్తాడు. జలుబు, దగ్గు కారణంగా లాలాపేట హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా అనే అనుమానంతో గాంధీ హాస్పిటల్‌కి వెళ్లాలని సూచించారు. ఇలా ఆస్పత్రిల వెంట తిరుగుతూనే ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
గురువారం రాత్రంతా మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుపై అటుగా వెళ్తున్న వారు రోడ్డుపై ఓ వ్యక్తి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం దగ్గర కింగ్ కోఠీ హాస్పిటల్ పత్రాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు అతడు హాస్పిటల్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments