కోవిడ్ ఆస్పత్రి నుంచి పారిపోయిన వృద్ధురాలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (23:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో ఓ కరోనా వైరస్ రోగి కోవిడ్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత అధికారులు నానా తంటాలు పడి ఆమెను గుర్తించి, తిరిగి తీసుకొచ్చి పోలీసు భద్రత మధ్య ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ ఐసోలేషన్ వార్డులో ఉండలేని ఆమె.. వైద్య సిబ్బంది, నర్సుల కళ్లుగప్పి.. వార్డు నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వైద్యులు.. అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత పట్టణమంతా గాలించగా, ఆదోనీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొదుకూరు మండలం, యాలకుర్తి గ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమెను తిరిగి పోలీసుల సహాయంతో తీసుకొచ్చి తిరిగి ఆస్పత్రిలో చేర్చారు. పైగా, ఆమెతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments