Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రి నుంచి పారిపోయిన వృద్ధురాలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (23:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో ఓ కరోనా వైరస్ రోగి కోవిడ్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత అధికారులు నానా తంటాలు పడి ఆమెను గుర్తించి, తిరిగి తీసుకొచ్చి పోలీసు భద్రత మధ్య ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ ఐసోలేషన్ వార్డులో ఉండలేని ఆమె.. వైద్య సిబ్బంది, నర్సుల కళ్లుగప్పి.. వార్డు నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వైద్యులు.. అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత పట్టణమంతా గాలించగా, ఆదోనీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొదుకూరు మండలం, యాలకుర్తి గ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమెను తిరిగి పోలీసుల సహాయంతో తీసుకొచ్చి తిరిగి ఆస్పత్రిలో చేర్చారు. పైగా, ఆమెతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments