Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రి నుంచి పారిపోయిన వృద్ధురాలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (23:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో ఓ కరోనా వైరస్ రోగి కోవిడ్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత అధికారులు నానా తంటాలు పడి ఆమెను గుర్తించి, తిరిగి తీసుకొచ్చి పోలీసు భద్రత మధ్య ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ ఐసోలేషన్ వార్డులో ఉండలేని ఆమె.. వైద్య సిబ్బంది, నర్సుల కళ్లుగప్పి.. వార్డు నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వైద్యులు.. అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత పట్టణమంతా గాలించగా, ఆదోనీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొదుకూరు మండలం, యాలకుర్తి గ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమెను తిరిగి పోలీసుల సహాయంతో తీసుకొచ్చి తిరిగి ఆస్పత్రిలో చేర్చారు. పైగా, ఆమెతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments