Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా.. తండ్రి నుంచి?

Advertiesment
corona virus
, గురువారం, 28 మే 2020 (19:13 IST)
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మన్నడిపేటలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కరోనా వైద్యం తీసుకుంటున్న తన తండ్రి నుంచి బాలుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యశాఖాధికారి తెలిపారు. ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా మొత్తం 23 లక్షల మందికి పైగా ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు గుర్తించింది. 
 
బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను అమలు చేస్తుండగా.. అధికారిక హోదాలో మినహాయింపు ఉన్న వారిని హోం క్వారంటైన్‌కి పంపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో విలయతాండవం.. 195మంది ఎయిమ్స్ సిబ్బందికి కరోనా