Webdunia - Bharat's app for daily news and videos

Install App

748మంది టిటిడి ఉద్యోగులకు కరోనా... ఐదుగురు మృతి

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (07:54 IST)
టిటిడిలో ఇప్పటి‌ దాకా 748 మంది కరోనా బారినపడినట్లు, ఐదుగురు మరణించినట్లు ఈవో‌ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత…ఇప్పటి దాకా 748 మందికి ఉద్యోగులు, అర్చకులు, భద్రతా సిబ్బంది కరోనా సోకినట్లు చెప్పారు. ఇందులో తిరుమలలో‌ 361, తిరుపతిలో 387 మంది ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే 305 మంది కోలుకున్నారని, ఇంకా 338 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

ఇప్పటి దాకా అలిపిరిలో 2, 029 మంది ఉద్యోగులకు, తిరుమలలో 4,532 మంది ఉద్యోగులకు కనోనా పరీక్షలు నిర్వహించినట్లు ఈవో సింఘాల్ తెలిపారు.అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని‌ ఎస్వీబీసిలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై ఈవో‌ స్పందించారు.

అదే సమయంలో శ్రీవారి కల్యాణోత్సవం ఉన్నందువల్ల అయోధ్య కార్యక్రమం ప్రసారం చేయలేకపోయామని చెప్పారు. అయితే దీనిపై‌ కొందరు అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారని‌ అన్నారు.

దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఆ సమయంలో టిటిడి కార్యక్రమమే ప్రసారం చేసాం తప్ప…ఏ క్రైస్తవ మత కార్యక్రమమో ప్రసారం చేయలేదని జవాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments