Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా... గుంటూరులో పెరుగుతున్న కేసులు

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:57 IST)
గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరులో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.

ఢిల్లీ నుండి వచ్చిన ఒక వ్యక్తి వల్ల నగరంలోని పాతగుంటూరు కుమ్మరి బజార్‌కు చెందిన ఒక కుటుంబానికి కరోనా సోకిందని జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చెప్పారు. ఆ కుటుంబానికి చెందిన 13 మంది ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

వీరిలో ఇద్దరికి మినహా మిగిలిన వారందరికి కరోనా వ్యాపించింది. బాధితుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వీరందరిని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు.

తాజా సంఘటనతో గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 75కు చేరింది. వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారే 57 మంది ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 405కు చేరుకుంది. శనివారం ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments