Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా... గుంటూరులో పెరుగుతున్న కేసులు

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:57 IST)
గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరులో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.

ఢిల్లీ నుండి వచ్చిన ఒక వ్యక్తి వల్ల నగరంలోని పాతగుంటూరు కుమ్మరి బజార్‌కు చెందిన ఒక కుటుంబానికి కరోనా సోకిందని జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చెప్పారు. ఆ కుటుంబానికి చెందిన 13 మంది ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

వీరిలో ఇద్దరికి మినహా మిగిలిన వారందరికి కరోనా వ్యాపించింది. బాధితుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వీరందరిని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు.

తాజా సంఘటనతో గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 75కు చేరింది. వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారే 57 మంది ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 405కు చేరుకుంది. శనివారం ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments