Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ పైన ఏపీ యుద్ధం, కోవిడ్ -19 వారియర్స్ రిక్రూట్‌మెంట్

కరోనా వైరస్ పైన ఏపీ యుద్ధం, కోవిడ్ -19 వారియర్స్ రిక్రూట్‌మెంట్
, శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:20 IST)
'కొవిడ్ వారియర్స్' పేరిట ఏపీ ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ బృందంలో ఇప్పటివరకు 2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్‌లు చేరారు.

వారే కాకుండా, ప్రైవేటు వైద్యులు, నర్సుల సేవలు కూడా ఉపయోగించుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. దీనిపై కొవిడ్-19 స్పెషల్ ఆఫీసర్ ఎం. గిరిజా శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది అవసరం ఉందని, అందుకే 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేదిక్, యునానీ కాలేజీల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారి కోసం ఈ 'కొవిడ్ వారియర్స్' పథకం తీసుకువచ్చామని తెలిపారు.

వైద్య విద్యార్థులే కాకుండా, ఆసక్తివున్న మెడికల్ ప్రాక్టీషనర్లు, స్పెషలిస్టులు, నర్సింగ్ కోర్సులు పూర్తిచేసినవారు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ మెడికల్ వలంటీర్లలో అనుభవం ఉన్నవారిని కరోనా ఆసుపత్రుల్లో వినియోగించుకుంటామని, వైద్య విద్యార్థులను క్వారంటైన్ సెంటర్లలో నియమిస్తామని తెలిపారు.

వారికి కొవిడ్-19 పేషెంట్లకు ఎలా చికిత్స అందించాలో శిక్షణ ఇస్తామని గిరిజా శంకర్ వివరించారు. మెడికల్ వలంటీర్లుగా ముందుకువచ్చేవారి ప్రయాణ ఖర్చులు, ఆహార భత్యాలు భరిస్తామని, వారికి పీపీఈ కిట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంతూరుకు వెళ్ళేందుకు శవం గెటప్... సినీ ఫక్కీలో ప్రయాణం.. చివరకు..