Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులకు పసరు మందు : ఇటుకల వ్యాపారిపై బైండోవర్ కేసు

Webdunia
గురువారం, 27 మే 2021 (12:04 IST)
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఇటుకల వ్యాపారి కరోనా బాధితులు పసరు మందు పంపిణీ చేశారు. దీంతో ఆయనపై పోలీలుసు బైండోవర్ కేసును నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఏడుచుట్లకోట గ్రామానికి చెందిన ఇటుకల వ్యాపారి గోవిందరాజులు అనే వ్యక్తి కరోనా రోగులకు గత నాలుగు రోజులుగా ఉచితంగా ఓ పసరు మందు పంపిణీ చేస్తున్నారు. 
 
ఈ మందును సుమారుగా 400 మందివరకు తీసుకున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో తహశీల్దార్‌ రవి ఆయన్ను పిలిపించి విచారించారు. తాను ఏడో తరగతి వరకే చదివానని, తమ కుటుంబానికి నాటుమందు ఇచ్చే నేపథ్యం ఉందని, ఆనందయ్య మందు గురించి తెలుసుకుని తానూ ఇస్తున్నట్లు గోవిందరాజులు వివరించారు. 
 
ఎలాంటి అర్హత లేకుండా నాటుమందు పంపిణీ చేస్తున్న ఆయనపై బైండోవర్‌ కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్‌ తెలిపారు. మందు పంపిణీ చేసినవారిలో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అధికారులకు నివేదించినట్లు సీఐ ప్రసాదబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments