Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచారామ క్షేత్రంలో ధన్వంతరి, మహా మృత్యుంజయ హోమాలు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:25 IST)
కరోనా మహమ్మారి ఏపీని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. గత రెండుమూడు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ రాష్ట్రాన్ని హడలెత్తిస్తోంది. అన్ని జిల్లాల నుంచి రెండంకెల లెక్కల్లో వైరస్ కేసులు నమోదు కావడంతో అంతటా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. దుకాణాలు, మార్కెట్లు అన్ని మూసివేయించారు. ప్రజలు ఇళ్లనుండి కాలు బయటపెట్టకుండా 144 సెక్షన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం, సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని కరోనా పట్టిపీడిస్తున్న నేపథ్యంలో దాని నివారణ కోసం, లోక శాంతి కోసం ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో అర్చక బృందం ధన్వంతరి హోమం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. 
 
భక్తులెవర్నీ లోనికి అనుమతించకుండా అర్చకులు, పండితులు ఈ హోమాలు జరిపారు. స్వామివారికి అర్చకులు రోజువారీ కైంకర్యాలు, పూజలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈఓ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments