Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తుల కుట్ర: విశ్వహిందూ పరిషత్

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (08:25 IST)
హిందూ సమాజాన్ని చీల్చి భారతదేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కార్యకర్తలు ముందుండాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంఘటన మంత్రి వినాయకరావు దేశ్ పాండే సూచించారు.

సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు, కులాల మధ్య అంతరాన్ని చెరిపేసేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పని చేయాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మతమార్పిడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం, సామాజిక వర్గం, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని విదేశీ శక్తులు.. పరాయి మతస్తులు హిందువులను మతం మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు మాయమాటలు చెప్పి భారతదేశం పైనే బురదజల్లే విధంగా దుష్టశక్తులు విషయం నింపుతున్నాయి అని  పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో దసరా రోజున రావణ దహనం కి బదులు రాముడి దహనం చేస్తున్నారని చెప్పారు. దుర్గామాత ను ద్వేషిస్తూ మహిషాసుర రాక్షసులను పూజిస్తున్నారు అని వివరించారు.

పెరిగిపోతున్న విదేశీ శక్తుల ఆగడాలను అడ్డుకునేందుకు కార్యకర్తలు శక్తికి మించి పని చేయాలని ఆయన సూచించారు. దేశం కోసం.. ధర్మం కోసం పని చేసే వారి సంఖ్య మరింత పెరగాలని చెప్పారు. స్వ శక్తులైన  కార్యకర్తలను గుర్తించి సంఘ కార్యంలో భాగస్వాములను చేయాలన్నారు.
 
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తయ్యేవరకు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పని చేయాలని పేర్కొన్నారు. సమాజంతో సంబంధాలు మరింత పెంచుకుని దేశ సేవ చేయాలని అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments