Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో బిజెపికి బుద్ది చెప్పాలి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:24 IST)
విజ‌య‌వాడ‌లోని ఎపిసిసి కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ జాతీయ పతాకాన్నిఎగుర వేసి, అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు.

అనంత‌రం సాకే శైలజానాధ్ మాట్లాడుతూ, ఆనాడు మనుషులు మధ్య విభేధాలు పెట్టి బ్రిటీష్ వాళ్లు దోచుకున్నార‌ని, పేదలకు నీడ లేకుండా తెల్లదొరలు అనేక హింసలు పెట్టార‌న్నారు. మహాత్మాగాంధీ నాడు క్విట్ ఇండియా అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చార‌ని, ఎందరో మహనీయులు త్యాగాలతో తెల్ల దొరలు వెళ్లిపోయార‌ని, ఇపుడు న‌ల్ల‌దొర‌లు మ‌ళ్ళీ దేశాన్ని బానిస‌త్వంలోకి తీసుకెళుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
దేశ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని, ఆర్.ఎస్. ఎస్. భావజాలంతో బిజెపి పాలకులు ప్రజల మధ్య కుల, మతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ‌చేసి.. నియంతృత్వ పాలన సాగిస్తున్నార‌ని, అలాంటి బిజేపీకి క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తి తో ప్రజలు తగిన బుద్ది చెప్పాల‌న్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments