Webdunia - Bharat's app for daily news and videos

Install App

57వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు..మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (09:00 IST)
రాజధాని రైతుల ఆందోళనలు 57వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి.

మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు 24 గంటల దీక్షలు నిర్వహించనున్నారు.

నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని రైతు కూలీలు, మహిళలు షిరిడి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
 
మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి
రాజధానిగా అమరావతిని కొనసాగించే విషయంలో ప్రధాని మోడీ, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలని, మీరు శంకుస్ధాపన చేసిన అమరావతిని తరలించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని టిడిపి సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ అంశాన్ని చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించగా సభ్యులు బలపరిచారు. ఇందు కోసం త్వరలో టిడిపి ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments