Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడకదారి పైకప్పు పనులు త్వరగా పూర్తి చేయండి: టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (19:39 IST)
చెప్పులు వేసుకోకుండా మైళ్ళ దూరం నడచుకుని వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే  సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పై కప్పు పనులు త్వరగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న నడక దారి పైకప్పు పనులను శనివారం ఆయన పరిశీలించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు పనులు ఏప్రిల్ చివరకు పూర్తి చేస్తామని చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి చైర్మన్ కు వివరించారు.

45వ మలువు నుంచి తిరుమల దాకా  జరుగుతున్న పనులను పరిశీలించిన చైర్మన్ వీటిని కూడా బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని సిఈ చెప్పారు.

బ్రహ్మోత్సవాల నాటికి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి పైకప్పు భక్తులకు అందుబాటులోకి వస్తుందని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఎస్ ఈ 2 నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments