Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ : టీటీడీ చైర్మన్

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ : టీటీడీ చైర్మన్
, ఆదివారం, 10 జనవరి 2021 (10:03 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ దేవాదాయశాఖతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
 
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు లోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో వెంకట్రావ్ సంక్రాంతి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమానికి  వెంకట్రావ్ గోవును దానం చేశారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడారు. గోవును పూజించే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని ఆయన చెప్పారు.

గోవు ముక్కోటి దేవతలతో సమానమని, అందుకే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. డిసిసి బ్యాంక్ చైర్మన్ వెంకట్రావ్ టీటీడీకి గోవును దానం చేయడం సంతోషమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మఒడి నగదును జగన్‌ జమ చేస్తారు: విద్యాశాఖ మంత్రి